నేటి భారతం :

అధికారుల చేతిలో న్యాయం అమ్ముడుపోతే..
ప్రజల జీవితాల్లో అంతులేని కష్టాలు పెరుగుతాయి..
అవినీతి అనేది నీరు లాంటి ద్రవం..
ఎక్కడా, ఎవరూ అడ్డుకోకపోతే ఇది ప్రతి మూలకీ చేరుతుంది..
ఒకరికి లంచం లాభం అయితే.. మరొకరికి నష్టం కలిగిస్తుంది..
కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి భరతమాతకు అవమానం మిగులుతుంది..
అవినీతి ఉన్న చోట ప్రజల హక్కులు చీకటిలో మునుగుతాయి.
పదవిలో ఉన్నవాడు ధర్మం మరిస్తే.. జనాల్లో విశ్వాసం చనిపోతుంది.
ప్రజా ధనం దోచుకునే అధికారికి కంటే..
దానిని చూస్తూ ఉండే నిశ్శబ్దం మరింత ప్రమాదకరం.
నిజాయితీ గల అధికారులు మినహాయింపుగా మారినప్పుడు..
అవినీతి అనేది నిత్యా కృత్యం అయిపోతుంది..
దీనిని నిర్మూలించేందుకు అందరూ నడుం కట్టాలి..
Read More నేటి భారతం :
About The Author
08 Nov 2025
