శ్రీ మహాశక్తి దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం
- పడి పూజకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీ మహాశక్తి దేవాలయం
- కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ
- పడిపూజలో పాల్గొననున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్ :
36వ శబరిమల యాత్ర చేస్తున్న సందర్భంగా పరమేశ్వర్ గురుస్వామి గురించి
ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్ప దీక్షలో మాల వేయించి, దీక్షకు సంబంధించిన నియమాలు, సందేహాలను నివృత్తి చేసే విషయంలో కావేటి పరమేశ్వర్ గురుస్వామికి ఎంతో గుర్తింపు ఉంది. భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి, ఉన్నత స్థితికి చేర్చడంలో కావేటి పరమేశ్వర్ గురుస్వామి కీలక పాత్ర పోషించడంతో, అనేక మంది అయ్యప్ప స్వామి భక్తులు పరమేశ్వర్ గురుస్వామిని దైవ సమానులుగా భావిస్తుంటారు. శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష, సమస్త భక్తజనుల ప్రయోజనాల కోసం చేస్తున్న కృషికి జాతీయస్థాయిలో గుర్తింపు పొంది, ఇటీవలే అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ 2025 సంవత్సరంకుగాను తెలంగాణ రాష్ట్రం నుండి పరమేశ్వర్ స్వామిని ఎంపికచేసి కాంచీపురంలో “అయ్యప్ప సేవ రత్న” అవార్డు ను అందించారు. కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టే పడిపూజకు ఎంతో ప్రాధాన్యత, విశిష్టత, నిష్ఠ, సమయపాలన, క్రమశిక్షణ ఉంటుంది. పూజచేసిన, ఇరుముడికట్టిన ఎలాంటి దక్షిణ తీసుకోకుండా 36 సంవత్సరాలుగా ఉచితంగానే సేవ చేయడం విశేషం. పేద, ధనిక భేదాలు లేకుండా ఏ స్వామి పిలిచినా తమ ఇంటికెళ్లి పూజ, భజన కార్యక్రమాలు చేస్తూ సేవ చేస్తుంటారు.
వృత్తిరీత్యా విశ్రాంత ఉపాధ్యాయుడు అయినా పరమేశ్వర స్వామి టీచర్ గా ఉన్న సమయంలో కూడా అటు స్కూలుకు, ఇటూ విద్యార్థులకు కూడా విద్యా బోధనలు నేర్పుతూ తనకు తోచిన విధంగా సేవ చేస్తూ వచ్చారు.పేద విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని తలచి పాఠశాలలకు తన మిత్రబృందం ద్వారా బెంచీలు, ఆర్వో ప్లాంట్, ప్రొజెక్టర్లు, అలాగే విద్యార్థులకు నోటు బుక్స్, టెక్స్ట్ బుక్స్ గైడ్స్, పెన్నులు కూడా అందించారు. పదవ తరగతి చదివే ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఉదయం మరియు సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా టిఫిన్లు, స్నాక్స్ అందించి వారిని ప్రోత్సహించారు. అయ్యప్ప సేవా సమితి ఏర్పాటు చేసి ఎన్నో వేల పడిపూజలు భజనలు చేస్తూ అయ్యప్ప గురుస్వామిలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నూతనంగా అయ్యప్ప మాల వేసుకొని కన్నె స్వాములకే కాకుండా వివిధ అయ్యప్ప భక్తులకు ఆదర్శంగా నిలిచారు. గతంలో అయ్యప్ప స్వామిని దీక్షాపరులను కించపరిచినప్పుడు, నిరసన కార్యక్రమాలను స్వాములందరితో కలిసి నిర్వహించారు. కరీంనగర్ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామికి లక్ష దీపార్చన, సహస్ర ఘటాభిషేకం, అయ్యప్ప స్వామి సప్తాహ నామస్మరణం లాంటి తదితర కార్యక్రమాలను అయ్యప్ప స్వామి దీక్ష పరుల సహాయ సహకారాలతో నిర్వహించారు. ఈ సంవత్సరం 36వ శబరిమల యాత్ర చేస్తున్నటువంటి పరమేశ్వర్ గురుస్వామి యావత్ అయ్యప్ప స్వాములకు ఆదర్శంగా నిలుస్తారు.
