జనామోదమైన కథనాలకు ప్రతీక భారత్ శక్తి పత్రిక.
జవహర్ నగర్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్.
జవహర్ నగర్ :
నికార్సైన జర్నలిజానికి చిరునామాగా భారత్ శక్తి పత్రిక నిలుస్తుందని, జనామోదమైన కథనాలకు, రచనలకు భారత్ శక్తి ఒక జనామోదం లాగా పరిగణించబడుతుందని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జవహర్ నగర్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు భాషవోని కొండల్ ముదిరాజ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నికార్సైన జర్నలిజానికి చిరునామాగా మారిన భారత్ శక్తి పత్రిక 2026 క్యాలెండర్ ను బుధవారం బాలాజీ నగర్ లోని తన కార్యాలయంలో జవహర్ నగర్ పుర ప్రముఖులు సీనియర్ నాయకుల మధ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు పత్రిక సోదరులు పాల్గొన్నారు.
About The Author
12 Mar 2026
