వరంగల్ లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

WhatsApp Image 2025-10-31 at 7.14.37 PM

ఉమ్మడి వరంగల్ : 

Read More హనుమకొండ లో హోటల్ కాకతీయ 369 మినీ బంకేట్ హల్ ప్రారంభం

శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ల్ భారీ వర్షాలతో జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై  మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లతో కలసి రాష్ట్రస్థాయి అధికారులు, 12  జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Read More హైడ్రా తన లక్ష్యాన్ని చేరుకుందా..?

సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో పర్యటించి పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేయండి.  ప్రాణ నష్టం, పంట నష్టం, పశు సంపద, అన్ని శాఖలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టానికి సంబంధించి నివేదికలు తెప్పించుకోండి. ఇందుకు ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోండి. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టర్లకు రిపోర్ట్ ఇవ్వండి..  
తుఫాను ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది.. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవాలీ.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంలో అలసత్వం వద్దు.  కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం రాబట్టుకుంటుంది..  తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించండి..  సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయి..  అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి..  నాలాల కబ్జాలను తొలగించాల్సిందే.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు.  పది మంది కోసం పదివేలమందికి నష్టం జరుగుతుంటే ఉపేక్షించొద్దు.. దీనిపై అధికారులు స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్లాల్సిందే..  వరదలు తగ్గిన నేపథ్యంలో శానిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి..  వరదల్లో ప్రాణ నష్టం జరిగినచోట రూ. 5 లక్షలు పరిహారం ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. ఇందుకు సంబధించి వివరాలు సేకరించండి..  పంటనష్టం, పశు సంపద నష్టపోయిన చోట వారికి పరిహారం అందించాలి.. ఇసుక మేటలు పేరుకున్న రైతులను ఆదుకునేందుకు అంచనాలు వేయండి.  ఇండ్లు మునిగిన వారికి ప్రతీ ఇంటికి రూ.15 వేలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేయండి..  ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించండి..  మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి..  
స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయండి..  ఎక్కడా పనులు ఆపే ప్రసక్తి ఉండొద్దు..  క్షేత్రస్థాయిలో ఒక కో-ఆర్డినేషన్ కమిటీ వేసుకుని పనిచేయాలి..  వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్ అనేది నిత్యకృత్యమైంది. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. అధికారులు నిర్లక్ష్యం వదలండి క్షేత్రస్థాయికి వెళ్లండి..  కలెక్టర్లు ఫీల్డ్ విజిట్స్ చేయాల్సిందే అని అన్నారు.

Read More కార్తీక పౌర్ణమి వేడుకల్లో దీపాలు వెలిగించిన జగ్గారెడ్డి

About The Author