వార్డు మెంబర్లుగా గెలిచిన విశ్వబ్రాహ్మణులకు సత్కారం

WhatsApp Image 2025-12-15 at 6.21.56 PM

ములుగు జిల్లా : 

గ్రామపంచాయతీ ఎన్నికలలో వార్డు మెంబర్లుగా గెలిచిన విశ్వబ్రాహ్మణులకు ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  ములుగు మండల అధ్యక్షుడు  కడివెండి వీరాచారి అధ్యక్షతన ములుగు, వెంకటాపూర్ మండలాలలో  స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్ష్మీదేవి పేట కడివెండి తిరుపతి  సర్వాపూర్ ఎర్రోజు నరేష్,వార్డుమెంబర్లుగా ఎన్నికైనందుకు వారిని  శాలువాతో సత్కరించి అభినందించారు. 

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షుడు ఎల్కతుర్తి రాజన్న, శ్రీలమంతల నరసింహ చారి, శ్రీనివాస్, శ్రీధర్, జ్ఞానేష్, శంకర్, దేవేందర్, మహేష్, రవీంద్ర చారి,  తదితరులు పాల్గొన్నారు.

About The Author