అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

సుడా సమీక్ష సమావేశంలో చైర్మన్ కోమటిరెడ్డి

కరీంనగర్ : 

WhatsApp Image 2025-09-18 at 7.35.41 PM

శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్, మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ లు చెప్పారు.  గురువారం సుడా కార్యాలయంలో చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గంతో పాటు చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలలో పలు అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు జరిగిందన్నారు. అలాగే నగరంలో మిగిలిపోయిన పలు కూడళ్ల సుందరీకరణ సుడా పరిధిలో చేపట్టబోయే నూతన లేఅవుట్లు తదితర అంశాలపై చర్చించినట్టు తెలిపారు.సుడా కమర్షియల్ బిల్డింగ్,  ఐడీఎస్ఎంటి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సుడా పరిధిలో నూతన లేఅవుట్లు ఏర్పాటు చేయాలని అందుకు గుర్తించిన ప్రాంతాలపై రెవెన్యూ, ల్యాండ్ సర్వే, సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తయారు చేసి లేఅవుట్లు చేయాలని నిర్ణయించినట్టు  పేర్కొన్నారు. వన్ టౌన్ పోలీస్టేషన్ ఎదురుగా చొక్కారావు ఐల్యాండ్ పక్కన ఉన్న ఐల్యాండ్ సుందరీకరణ చేయాలని నగరలోని ప్రధాన రోడ్లలో గల నాలాల బ్రిడ్జిలపై ఇరువైపులా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో బ్రిడ్జి మాదిరిగా ప్లాంట్స్ తో సుందరీకరణ చేయాలని నిర్ణయించామని  తెలిపారు. చొప్పదండి నియోజక వర్గంలోని కొక్కేరకుంట కోనాయపల్లి రోడ్డుకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు.  అభివృద్ధి పనులు, సుడాకు అభివృద్ధి చార్జీలు కట్టని పెట్రోల్ బంకులకు నోటీసులివ్వాలని కమర్షియల్ గా నడుపుతూ, అభివృద్ధి పన్నులు చెల్లించని ఫామ్ లకు కూడా నోటీసులివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీవో ఆంజనేయులు,ఎస్ఈ రాజ్ కుమార్,ఈఈ రొడ్డ యాదగిరి,డిఈఈ రాజేంద్ర ప్రసాద్, టీపీవో శ్రీధర్ ప్రసాద్,టీపీఎస్ సంధ్య, అజ్మల్ తదితరులు పాల్గొన్నారు.

Read More అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

About The Author