సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
- నిధులు కేటాయిస్తూ జీవో విడుదలపై హర్షం

సంగారెడ్డిసదాశివపేట మున్సిపాలిటీల కు 18 కోట్ల 70 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి టీజీఐఐ సీ చైర్పర్సన్ నిర్మల తో కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రెండు మున్సిపాలిటీలకు కలిపి 37 కోట్ల 40 లక్షల రూపాయల నిధులతో త్వరలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. వీటికి సంబంధించిన పనులను వివరించారు. అర్బన్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు జీవో విడుదల చేయడం జరిగిందన్నారు. సదాశివపేట మున్సిపాలిటీల పరిధిలో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణం ఊబ చెరువు సుందరీ కరణ కోసం 1.5 కోట్లు, అయ్యప్ప దేవాలయం నుంచి బిఎస్ఎన్ఎల్ వరకు సెంట్రల్ మీడియం సెంట్రల్ లైటింగ్ కోసం 1.6 6 కోట్లు, డబుల్ బెడ్ రూమ్ పరిసరాల్లో కనీస సౌకర్యాల కోసం 50 లక్షలు, గురు నగర్ కాలనీలో పార్క్ డెవలప్మెంట్ కోసం 50 లక్షలు, హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు కోసం 30 లక్షలు, అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీలోనీ విలీన గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు, వరద నీరు మళ్లింపు కోసం ప్రత్యేక డ్రైనేజీల నిర్మాణం చేపట్టేందుకు 5.9 కోట్లు, పార్కుల అభివృద్ధి కోసం 1 కోటి 35 లక్షలు, పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలను ప్రణాళిక బద్ధంగా చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తామని వివరించారు.
