మత్తులో స్టీరింగ్ పడితే జైలుకే!
- మల్కాజిగిరిలో వారాంతపు తనిఖీల్లో 321 మందిపై కేసులు
- భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కింద కఠిన చర్యలు
మల్కాజిగిరి
వారాంతపు మత్తులో జోగుతూ వాహనాలు నడిపేవారిపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏకంగా 321 మంది మద్యం బాబులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే ఉండటం గమనార్హం.
వాహనాల వారీగా వివరాలు:
గత వారం తీర్పులు:
హెచ్చరిక: 10 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చు!
"మద్యం సేవించి వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదాలకు కారణమైతే, ఇకపై సాధారణ కేసులు కాకుండా భారతీయ న్యాయ సంహిత (BNS)-2023, సెక్షన్ 105 కింద 'హత్య కాని నేరపూరిత నరహత్య' కేసులు నమోదు చేస్తాం. దీనివల్ల నిందితులకు పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది" అని మల్కాజిగిరి డి.సి.పి స్పష్టం చేశారు.
About The Author
10 Mar 2026
