ఎల్బీనగర్ ప్రగతి పథంలో.. రూ. 45 కోట్లతో పనుల జోరు ఎన్నికల కోసమే కాదు..
జవాబుదారీతనంతోనే అభివృద్ధి: మంత్రి శ్రీధర్ బాబు
- వడ్డీల భారం ఉన్నా ఆగని సంక్షేమం
- రెండేళ్లలో రూ. 760 కోట్లతో అభివృద్ధి: మధుయాష్కీ గౌడ్
ఎల్బీనగర్ :
ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ జవాబుదారీతనంతోనే పని చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంగళవారం ఆయన సుమారు రూ. 45 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, బొగ్గారపు దయానంద్లతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సంక్షేమమే మా అజెండా:
అయినప్పటికీ, తమ ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తూ, సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తోందని గుర్తు చేశారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా వనస్థలిపురంలో మినీ ఆడిటోరియం నిర్మిస్తామని, ఐదు కాలనీల్లో కమ్యూనిటీ హాళ్లకు నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.
అభివృద్ధిలో కొత్త రికార్డు:
ముఖ్య విశేషాలు:
మౌలిక సదుపాయాలు: ట్రాఫిక్ చిక్కులు వీడేలా ఫ్లైఓవర్లు, వంతెనల నిర్మాణం.
వరద ముప్పు నివారణ:
ప్రాధాన్యత క్రమంలో నాలాల విస్తరణ పనులు.
ఇందిరమ్మ రాజ్యం: సొంతింటి కల నెరవేర్చేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, బానోతు సుజాత నాయక్ సహా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
