గోషామహల్, కార్వాన్ సర్కిళ్లలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ తనిఖీ,

గోషామహల్, కార్వాన్ సర్కిళ్లలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ తనిఖీ,

హైదరాబాద్:

‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సోమవారం ఉదయం గోషామహల్, కార్వాన్ సర్కిళ్లలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. పారిశుద్ధ్యం, జంక్షన్ల అభివృద్ధి, రహదారుల నిర్వహణ పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

​పర్యటనలోని ముఖ్యాంశాలు:
​జంక్షన్ల అభివృద్ధి: భగత్ సింగ్ జంక్షన్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. రహదారులపై ఉన్న గుంతలకు తక్షణమే ప్యాచ్ వర్క్‌లు పూర్తి చేసి, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

​ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ: పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తున్న మరుగుదొడ్లను తనిఖీ చేశారు. సిబ్బంది హాజరును పరిశీలించి, నిర్వహణలో అలసత్వం వహించరాదని, నిత్యం శుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు.

​ఆక్రమణల తొలగింపు: అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఉగాది నాటికి ఈ భవనాన్ని ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని సూచించారు.

​పారిశుద్ధ్య పరిశీలన: కాలినడకన తిరుగుతూ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు (జీవీపీ), జియాగూడ 100 ఫీట్ల రోడ్డులో పారిశుద్ధ్య పనులను సమీక్షించారు. చెత్త నిల్వలు లేకుండా చూడాలని రామ్‌కీ ప్రతినిధులు, శానిటేషన్ సిబ్బందికి సూచించారు.

​ఈ తనిఖీల్లో జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, అడిషనల్ కమిషనర్ రవికిరణ్‌తో పాటు ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

About The Author