వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలన

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది - రాష్ట్ర మంత్రి పొన్నం

WhatsApp Image 2025-10-30 at 6.43.38 PM

కరీంనగర్ :

Read More నేను బెంజిలో తిరిగిన గంజికే కనెక్ట్ అవుతా..

తుపాన్ కారణంగా బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను, రహదారులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ అలం లతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి నుండి వస్తున్న వరద ప్రభావంతో  సీతారాంపూర్  దెబ్బతిన్న రోడ్డును, కూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు..

Read More నేటి భారతం..

వరద ప్రభావంతో వరి పొలాల్లోకి పూర్తిక ఇసుక మేటలు వేయడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇందుర్తి కోహెడ మధ్య లోలెవెల్ బ్రిడ్జిపై వరద నీరు ప్రవాహాన్ని పరిశీలించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా ఇందుర్తి లో లెవెల్ బ్రిడ్జి లో పై నుండి వరద ఉదృతంగా ప్రవహిస్తుందనీ రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. ఈ సంవత్సరంలో మూడు సార్లు ఇలా పై నుండి వరద పోతుందనీ ఇందుర్తి నుండి కోహెడ వెళ్ళే బ్రిడ్జి పై నుండి వల్ల రాకపోకలు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు.

Read More ఘనంగా నెహ్రూ 136వ జయంతి వేడుకలు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రేపు ముఖ్యమంత్రి  ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జిపై రిప్రజెంటేషన్ ఇస్తామని, అలాగే కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా మధ్య ఉన్న లింక్ రోడ్డును మరమ్మతులు చేపడతామని చెప్పారు. వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు ,నష్టపోయిన పంటలను మొత్తం రికార్డ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా కి సంబంధించి రైతులకు ఎక్కడ  ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందనీ చెప్పారు. 

Read More యువకులు క్రీడల్లో రాణించాలి

సైదాపుర్ లో ఐకేపీ కేంద్రాని పరిశీలన :
సైదాపూర్ లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని, సైదాపూర్ లోని హుస్నాబాద్- హుజూరాబాద్ రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న వరద నీటిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ  వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు, నష్టపోయిన పంటలను మొత్తం రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశిస్తామని అన్నారు. రైతులకు ఎక్కడ  ఇబ్బందులూ లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. మంత్రి వెంట అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, ఆర్టీవోలు మహేశ్వర్, రమేష్ బాబు పాల్గొన్నారు.

Read More రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి

About The Author