ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ..
బడంగ్పేట్:
బడంగ్పేట్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆర్యవైశ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని, సంఘం ఐక్యంగా ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, గట్టు బాలకృష్ణ, బొల్లపల్లి కుమార్, ఆర్యవైశ్య సంఘం నాయకులు తోనుపునూరి శ్రీనివాస్ గుప్తా, దాచేపల్లి వెంకటేశ్వర్లు, విరమల్లి రామమూర్తి, సంఘం కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
04 Feb 2026
