సిద్ధార్థలో 'వేలిముద్రల' రాజ్యమా?
అధ్యాపకుల బతుకులతో చెలగాటమా?
- నిప్పులు చెరిగిన TSTCEA రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్
- పదిహేనేళ్ల చాకిరీకి ప్రతిఫలం.. రోడ్డున పడేయడమేనా? | సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం నేరపూరితం
- SITS యాజమాన్యం అక్రమాలపై ఢిల్లీ వేదికగా పోరాటం: సంతోష్ కుమార్ హెచ్చరిక
హైదరాబాద్:
"కళాశాల అంటే విద్యా దేవాలయం కావాలి.. కానీ నారపల్లిలోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ (SITS) యాజమాన్యం దాన్ని ఒక 'కంపెనీ'లా మార్చేసింది. లాభాల కోసం అధ్యాపకుల రక్తాన్ని పీల్చేస్తూ, వారి భవిష్యత్తును కాలరాస్తోంది" అంటూ తెలంగాణ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (TSTCEA) రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం నాడు బాధిత అధ్యాపకులతో కలిసి ఆయన యాజమాన్యం తీరును ఎండగట్టారు.
సర్టిఫికెట్ల నిర్బంధం.. చట్టవిరుద్ధం!
తంబ్ ఇంప్రెషన్ల మాయాజాలం..
కళాశాలలో చదువు చెప్పే నిజమైన అధ్యాపకులు లేరని, కేవలం రికార్డుల కోసం 'వేలిముద్రలు' వేసే వారితో (Thumb Faculty) నెట్టుకొస్తున్నారని సంతోష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
నిబంధనల ఉల్లంఘన: JNTUH, AICTE నిబంధనలను బేఖాతరు చేస్తూ, కేవలం కాగితాల మీద ఫ్యాకల్టీని చూపిస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
నాణ్యత శూన్యం: నాణ్యమైన విద్యను గాలికొదిలేసి, ఫీజుల వసూళ్లపైనే యాజమాన్యం దృష్టి పెట్టిందని విమర్శించారు.
ఢిల్లీకి చేరువలో సిద్ధార్థ అక్రమాలు!
ఈ వ్యవహారంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సంతోష్ కుమార్ స్పష్టం చేశారు.
"మేము ఇప్పటికే TGCHE చైర్మన్కు ఫిర్యాదు చేశాం. తక్షణమే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలి. లేనిపక్షంలో UGC, AICTE అధికారులను కలిసి సిద్ధార్థ కాలేజీ గుర్తింపు రద్దు అయ్యే వరకు పోరాడుతాం. అధ్యాపకుల ఆత్మగౌరవంతో ఆడుకుంటే సహించేది లేదు" అని ఆయన యాజమాన్యాన్ని హెచ్చరించారు.
బాధితుల ఆవేదన..
దశాబ్ద కాలంగా పనిచేసినా కనీస గౌరవం లేకుండా తొలగించారని, కుటుంబాలు రోడ్డున పడ్డాయని బాధిత అధ్యాపకులు కన్నీటి పర్యంతమయ్యారు. సంతోష్ కుమార్ అండగా నిలవడంతో వారు తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు.
