రంజిని తాండ నూతన గ్రామపంచాయతీకి సర్పంచ్‌గా జాదవ్ సవితాబాయి.

WhatsApp Image 2025-12-17 at 6.04.36 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో : 

కుబీర్ మండలంలోని రంజిని తాండ నూతనంగా గ్రామపంచాయతీగా ఏర్పడిన నేపథ్యంలో తొలిసారి నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో జాదవ్ సవితాబాయి బన్సీలాల్ సర్పంచ్‌గా, రంగారావు ఉప సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు.గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో ఓటు వేసి వీరిని గెలిపించడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీకి తొలి సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన జాదవ్ సవితాబాయి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అదే విధంగా ఉప సర్పంచ్ రంగారావు కూడా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామ సంక్షేమానికి కృషి చేస్తామని సర్పంచ్, ఉప సర్పంచ్ తెలిపారు.
నూతన గ్రామపంచాయతీ ఏర్పాటుతో రంజిని తాండ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

About The Author