
కామారెడ్డి జిల్లా :
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం కామారెడ్డి పట్టణ బీజేపీ ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బీజేపీ ఎస్టీ మోర్చా పట్టణ అధ్యక్షుడు వినోద్ గా ప్రకటించడం జరిగింది. ఉపాధ్యక్షులుగా, కె. రాములు, కె. ప్రవీణ్, కె. ప్రశాంత్, రాథోడ్ అనిల్, బి. నవీన్, ప్రధాన కార్యదర్శులుగా, కె. నవీన్, కార్యదర్శిలుగా, బి. రవి, బి. సంజు, కె. ఆనంద్, కె. రవీందర్, క్యాషియర్ గా, కె. గంగాధర్ లను నియమిస్తున్నట్టు తెలియజేశారు. పట్టణ బీజేపీ ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గాన్ని పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ శాలువాలతో సన్మానం చేయటం జరిగింది. బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తూ పార్టీ పటిష్టతకు అందరం కలిసి ముందుకు సాగాలని అన్నారు.