ఉద్యమకారులకు అండగా కవితక్క పోరాటం..! కవితక్కకు అధ్యయన నివేదిక అందజేత
కాంగ్రెస్ తీరుపై కప్పాటి పాండురంగారెడ్డి విమర్శలు
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ప్రస్తుత ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారుల స్థితిగతులపై ‘తెలంగాణ జాగృతి ఉద్యమకారుల సంక్షేమ కమిటీ’ నిర్వహించిన క్షేత్రస్థాయి అధ్యయన నివేదికను సోమవారం హైదరాబాద్లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు అందజేశారు.
క్షేత్రస్థాయిలో కష్టాల కడలి:
సర్కారుపై విమర్శలు:
ఈ కార్యక్రమంలో అధ్యయన కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి బండారి శ్రీనివాస్ గౌడ్, ములుగు జిల్లా అధ్యక్షుడు నంగావత్ రాజేష్, శీలం వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి స్టీరింగ్ కమిటీ ప్రతినిధుల సమక్షంలో ఈ నివేదికపై సుదీర్ఘంగా చర్చించారు.
About The Author
04 Feb 2026
