భూపాలపల్లి జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చుదాం
భూపాలపల్లి :

కాటారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో మాదకద్రవ్య రహిత జిల్లాగా మారేందుకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చర్యలు ముమ్మరం అవుతున్నాయి. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి శ్రీమతి మల్లేశ్వరి ఆదేశాల మేరకు “మిషన్ పరివర్తన్” కార్యక్రమాన్ని మంగళవారం కాటారం మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించడం జరిగింది.
మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వలన కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక ప్రభావాలపై వివరించారు. మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగం జరిగితే వెంటనే *100, **14446, **1908* నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, మరియు మహిళా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ కలసి మాదకద్రవ్య రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేసి, “మనం మారుదాం – సమాజాన్ని మార్చుదాం” అనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.
About The Author
06 Dec 2025
