జాబ్ మేళ వివరాలను తెలియజేసిన- మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

సూర్యాపేట :
ఫార్మా హెల్త్ కేర్ హాస్పిటాలిటీ విభాగంలో 2167 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా, 210 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని, మరో 195 మంది అభ్యర్థుల షార్ట్ లిస్టును రూపొందించామని చెప్పారు.ఆటోమొబైల్స్ రంగంలో 952 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా,102 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని,154 మంది అభ్యర్థుల షర్ట్ లిస్టును సిద్ధం చేశామని తెలిపారు.లాజిస్టిక్ ఎయిర్ పోర్ట్ రంగంలో 1047 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా,188 మంది అభ్యర్థులు ఉద్యోగాలు కు ఎంపిక అయ్యారని,10 మంది అభ్యర్థుల షార్ట్ లిస్టును రూపొందించినట్టు చెప్పారు.జాబ్ మేళాకు ఆన్ లైన్ ద్వారా 40 వేల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా,20463 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అయ్యారని,అందులో 3041 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని,మరో 1533 మంది అభ్యర్థుల షార్ట్ లిస్ట్ జాబితాను రూపొందించినట్టు పునరుద్ఘాటించారు.ముందుగా జాబ్ మేళా ను రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ,ఇతర ప్రదేశాలలో జాబ్ మేళా నిర్వహించవలసి ఉన్న కారణంగా కొన్ని కంపెనీలు మాత్రమే ఆదివారం జాబ్ మేళాకు హాజరవుతున్న దృష్ట్యా ఆదివారం నిర్వహించదలచిన జాబ్ మేళాను వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు. తిరిగి ఈ జాబ్ మేళాను ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.హుజూర్ నగర్ లో నిర్వహించిన జాబ్ మేళాను విజయవంతం చేయడంలో సహకారం అందించిన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులు,సిబ్బంది అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు..
