ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు:
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో మురళీకృష్ణ బెండపూడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పటాన్చెరు సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సునీత కృష్ణం రాజు, కృష్ణం రాజు, శ్రీధర్ చారి, నర్రా బిక్షపతి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
About The Author
19 Apr 2026
