సరిహద్దుల చెక్ పోస్టులను మూసివేయాలని ఆదేశాలు జారీ.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :

ఈ నిర్ణయించడాన్ని ప్రత్యేకంగా లారీ యజమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు .. 
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు .
తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్
తెలంగాణలో ఆర్టిఏ చెక్ పోస్టులు మూసివేతపై హర్షం
బోర్డులు, బారికేడ్లు తొలగింపు పట్ల ప్రభుత్వానికి లారీ యజమానుల కృతజ్ఞతలు

WhatsApp Image 2025-10-22 at 7.00.32 PM

లారీ యజమానుల సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు
అవినీతి అడ్డాలుగా మరి వాహనదారులను పీల్చి తింటున్న సరిహద్దుల్లోని ఆర్టీఏ చెక్ పోస్టులను ఎత్తిన వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడాన్ని వాహనదారులు ప్రత్యేకంగా లారీ యజమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు .. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు .ఇటీవల సరిహద్దు చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడిచేసిన నేపథ్యంలో వారి అవినీతిని చూసి అవాక్కు అయ్యారని ఇదే విషయాన్నీ ఉన్నతాధికారులకు తెలియజేశారు . వారు సీఎం దృష్టికి తీసుకోని పోవడంతో వెంటనే చెక్ పోస్టులు మూసి వేసి ఆన్ లైన్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించారు …ఈ మేరకు బుధవారం ఒకే సమయంలో సరిహద్దుల చెక్ పోస్టులను మూసివేయాలని ఆదేశాలు వెళ్లడం అక్కడ బోర్డులు తీసివేయాలని ,చెక్ పోస్టుల్లో ఉన్న ఫుర్నిచర్ ఆర్టీఓ కార్యాలయాలకు తరలించాలని ఆదేశాలు జారీచేశారు ..సిబ్బందిని రాష్ట్ర ట్రాస్పోర్ట్ కమిషనర్ కు రిపోర్ట్ చేయాలనీ ఆదేశాల్లో పేర్కొన్నారు .

Read More సాహితీ రాము స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల శబరిమల మహాపాదయాత్ర

రాష్ట్రంలోని అన్ని రవాణా చెక్ పోస్టులను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేయడం లారీ యజమానులకు ఎంతో సంతృప్తిని ఊరటను ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్ హర్షం ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సయ్యద్ సాదిక్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు పెద్దలకు ఎమ్మెల్యేలకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ తరపున ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లను అసోసియేషన్ సభ్యులు కలుసుకొని వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, వెంటనే వారు స్పందించి త్వరలోనే చర్యలు చేపడతామని హామీ ఇచ్చి ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవడం వల్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు. అక్టోబర్ 22న సాయంత్రం 5 గంటల లోపు మూసివేయాలని ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం శుభపరిణామం అని సాదిక్ అన్నారు. రెండు నెలల క్రితమే చెక్ పోస్టులను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నా కొనసాగించడంపై ఆర్టీఏపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారనీ రవాణా శాఖపై ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ధి ఉందని ఈ సందర్భంగా కొనియాడారు.

Read More శబరిమల యాత్ర దిగ్విజయం కావాలి

ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్ పోస్టులు మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారనీ, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారనీ చెక్ పోస్టుల దగ్గర ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగించాలని ఆదేశించారనీ సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలని.. చెక్ పోస్టుల దగ్గర ఎవరూ ఉండొద్దన్నారనీ దీనివల్ల రవాణా శాఖకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

Read More నేటి భారతం

చెక్ పోస్టుల దగ్గర వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని వెల్లడించారనీ రికార్డులు, ఫర్నీచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి తరలించాలని తెలిపారు. ఆర్థిక, పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని ప్రభుత్వం ఆదేశించిందని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వాలని చెప్పారు. చెక్ పోస్టుల మూసివేతపై సమగ్ర నివేదిక అక్టోబర్ 22 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని వెంటనే చర్యలు తీసుకుంటున్నందుకు ప్రభుత్వానికి లారీ ఓనర్స్ అసోసియేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అని సయ్యద్ సాదిక్ పేర్కొన్నారు.. 

Read More నూతన ఇంచార్జి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్వో)గా డా. ఎం. విద్యా రాణ్ వల్కర్

About The Author