శాంతి భద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం.
- నూతన సిఐని మర్యాద పూర్వకంగా కలిసిన భవన నిర్మాణ కార్మిక సంఘం.
జవహర్ నగర్ :
శాంతి భద్రతల పరిరక్షణే ద్యేయంగా పనిచేస్తామని, నేరాల అదుపులో ఆధునిక సాంకేతికను ఉపయోగించి నేరస్తులను కటకటాల్లోకి నెడుతామని జవహర్ నగర్ ఎస్హెచ్వో ఎస్. సైదులు తెలిపారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు శుక్రవారం జవహర్ నగర్ నూతన ఇన్స్పెక్టర్గా సైదులు పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాదపూర్వకంగా ఇన్స్పెక్టర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ సంఘ నాయకులతో ఇన్స్పెక్టర్ సైదులు మాట్లాడుతూ జవహర్ నగర్ లో పేద మధ్య తరగతి జనాభా ఎక్కువగా ఉందని ప్రజల సంక్షేమం కోసం శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. నేరాల అదుపులో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షులు చెన్నాపురం యాదయ్య, గౌరవ అధ్యక్షులు కొయ్యాడ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బూడిద వెంకటేష్, మరాటి బాబు, చెన్నారెడ్డి, వై. మల్లేష్, రమణారెడ్డి, ఐలయ్య, రాములు, రవి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
