
వేములవాడ :
వేములవాడ ట్రాక్టర్ యూనియన్ నూతన అధ్యక్షునిగా సరిపల్లి కార్తీక్ గెలుపొందారు. పట్టణంలో ట్రాక్టర్ల సంఘం అధ్యక్షుని ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు,ఈ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 218, పోలైన ఓట్లు 203 కాగా 66 ఓట్లు ప్రత్యర్థి అనుముల బాలయ్యకి రాగా సరిపెల్లి కార్తీక్ కి 137 ఓట్లు సాధించి 71 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందాడు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కార్తీక్ మాట్లాడుతూ వేములవాడ పట్టణ ట్రాక్టర్ అసోసియేషన్ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలుపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపారు.రాబోయే రోజుల్లో ట్రాక్టర్ యూనియన్ ని మరింత బలోపేతం చేసి,యూనియన్,డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ట్రాక్టర్ యూనియన్ సభ్యులు నూతన అధ్యక్షుడు కార్తీక్ ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.