స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలి.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :

స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ 2002 పై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి హైదరాబాదు నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్ల తొలగింపు కు 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో చివరగా 2002 లో ఎస్ఐఆర్ చేయడం జరిగిందని తెలిపారు. ఎస్ఐఆర్ నిర్వహణ పై మాస్టర్ ట్రైయినర్ల ద్వారా బూత్ స్థాయి సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు.
అనంతరం ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రిటర్నింగ్ అధికారి, ఏఈఆర్ఓ, డిప్యూటీ తహసిల్దారులు, బిఎల్ఓ, పర్యవేక్షకులు తగినంత మంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ, ఎస్ఐఆర్ నిర్వహణపై మాస్టర్ ట్రైయినర్ల ద్వారా బూత్ స్థాయి సిబ్బందికి అవగాహన కలిగేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ నిర్వహణకు ముందుగానే ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్ఐఆర్ వివరాలను 2025 ఎస్ఎస్ఆర్ డేటా తో సరిపోల్చాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
