కోటాలో ఆధ్యాత్మిక పరిమళం

విద్యార్థులకు చిన్న జీయర్ స్వామి ఆశీర్వచనాలు
విద్యార్థులకు భగవద్గీతపై ఓరియంటేషన్ తరగతుల్లో కర్తవ్య బోధన

WhatsApp Image 2025-12-28 at 4.12.37 PM

కరీంనగర్ : 

కోట విద్యాసంస్థల్లో ఆధ్యాత్మిక వాతావరణం పరిమిలించింది. పబ్లిక్ స్కూల్,  జూనియర్ కళాశాలల్లో  శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ జీయర్ స్వామి, ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్, వాల్మీకి విద్యాసంస్థలను చైర్మన్ యాదగిరి శేఖర్ రావులు సందర్శించి కోటా కుటుంబానికి తమ ఆశీర్వాదాలు అందించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓరియంటేషన్ తరగతులు నిర్వహించగా, భగవద్గీతలోని జీవన విలువలు, కర్తవ్యబోధ, క్రమశిక్షణ, నైతికత వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. చిన్న వయస్సు నుంచే ఆధ్యాత్మిక విలువలు అలవర్చుకుంటే విద్యార్థులు ఉన్నత వ్యక్తిత్వంతో ఎదుగుతారని జీయర్ స్వామి  పేర్కొన్నారు. ఈ సందర్బంగా  రామానుజ జీయర్ స్వామి  మాట్లాడుతూ, “భగవద్గీత కేవలం గ్రంథం మాత్రమే కాదు, అది జీవన మార్గదర్శిని. గీతలో చెప్పిన కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం విద్యార్థుల జీవితాలను సరైన దిశలో నడిపిస్తాయి. చదువుతో పాటు సంస్కారం ఎంతో అవసరం” అని తెలిపారు.
ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్  మాట్లాడుతూ, కోటా విద్యాసంస్థలు విద్యతో పాటు నైతిక విలువలకు పెద్దపీట వేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుతాయని అన్నారు.

టీఆర్‌ఎస్‌ఎంఏ అధ్యక్షులు  యాదగిరి శేఖర్ రావు  మాట్లాడుతూ, ఆధునిక విద్యకు ఆధ్యాత్మికతను జోడిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కోటా విద్యాసంస్థల కృషిని ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కోట విద్యాసంస్థలు ముందుకు వెళ్తున్నాయని అన్నారు

కోటా విద్యాసంస్థల నిర్వాహకులు అతిథులకు ఘన స్వాగతం పలికారు. ప్రిన్సిపాల్ లు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చివరగా కోటా కుటుంబానికి జీయర్ స్వామి  ప్రత్యేక ఆశీర్వచనాలు అందించడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక శోభతో ముగిసింది.

About The Author