సింగూర్ ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా
సంగారెడ్డి : డ్యామ్ సురక్షితత పై ప్రత్యామ్నాయ మార్గాలను , మంత్రి దామోదర్ రాజనర్సింహా జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఎస్ ఈ పొచ్చా మల్లు, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఎగువ ప్రాంతం నుండి వస్తున్న 31,968 క్యూసెక్కుల వరద దృష్ట్యా, సింగూర్ ప్రాజెక్ట్ నుండి దిగువకు 43,634 క్యూసెక్కుల వరదను ఐదు గేట్ల ద్వారా విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు.డ్యామ్ సేఫ్టీ కమిటీ సూచనల మేరకు, సింగూర్ జలాశయం భద్రతను కాపాడే విధంగా 520.5 మీటర్ల వరకు నీటి నిల్వను యావరేజ్గా ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Read More హెచ్ఎమ్డిఎతో అభివృద్ధి శూన్యం..