గోరక్షకులపై దాడి చేసిన నింధితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి..
- బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం..

కామారెడ్డి జిల్లా :
ఇలాంటి మతవాద దాడులు రాష్ట్రంలో చట్టవ్యవస్థ పూర్తిగా కూలిపోయిందని నిరూపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండీ తెలంగాణ రాష్ట్రంలో ఎం.ఐ.ఎం మతోన్మాద మూకల స్వైర విహారం విపరీతంగా పెరిగిపోయిందనీ, ఎం.ఐ.ఎం నాయకుల రాక్షసత్వానికి బీ.ఆర్.ఎస్ పార్టీ మౌనంగా ఉండి మద్దతు తెలిపితే, కాంగ్రెస్ పార్టీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందనీ అన్నారు.
అమాయక ప్రజలపై, అధికార యంత్రంగంపై, చివరికి రక్షణ కల్పించే పోలీసుల గుండెల్లో ఎం.ఐ.ఎం గూండాలు కోరలు దింపుతున్నా.. చోద్యం చూస్తున్న చేవలేని కాంగ్రెస్ పార్టీ చేతకానితనాన్ని ఎండగడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్.రాంచందర్ రావు నేతృత్వంలో కాంగ్రెస్ - ఎంఐఎం రజాకార్ పాలనకు వ్యతిరేకంగా నిరసన చేపడితే, గోరక్షకులపై తుపాకీలతో దాడిచేసిన ఎం.ఐ.ఎం నాయకులను, పోలీసులపై దాడి చేసిన ఎం.ఐ.ఎం కార్యకర్తలను అరెస్టు చేసే దమ్ములేని కాంగ్రెస్ ప్రభుత్వం నిరసన చేపట్టిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు ని, బిజెపి నాయకులను అక్రమంగా అరెస్టు చేయటం సిగ్గు చేటు అని అన్నారు. ప్రభుత్వం వెంటనే దోషులను అరెస్ట్ చేసి, కఠిన శిక్ష విధించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని, హిందువుల భద్రతకు హామీ ఇవ్వలేని పక్షంలో, ఆ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కును కోల్పోతుందనీ అన్నారు.
