నేటి నుండి పనుల జాతర ప్రారంభం

గ్రామీణాభివృద్ది జిల్లా అధికారి ఎం.శ్రీనివాస్ రావు

ములుగు జిల్లా : 

WhatsApp Image 2025-08-21 at 5.50.04 PM

రాష్ట్ర వ్యాప్తంగా  ఈనెల 22 నుండి "పనుల జాతర" కార్యక్రమం పంచాయితీ రాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించబడుతుందని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి, ఎం. శ్రీనివాస్ రావు గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.

Read More హైదరాబాద్‌లో విషం చిమ్ముతున్న డ్రగ్స్ సంస్కృతి.. 

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీల లో ఇప్పటికే పూర్తయిన పనులను ప్రారంభించడం తో పాటు, కొత్త పనులకు భూమి పూజలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం ( ఎం జి ఎన్ఆర్ ఈజిఎస్) పనులు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ పనులు,స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్ బి ఎం) పనులు ఉంటాయన్నారు.

Read More రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలి..

ప్రధానంగా పనులు :
కమ్యూనిటీ శౌచాలయ సముదాయములు, పశువుల కొట్టాలు, కోల్లు, మేకల షెడ్లు, వ్యవసాయ బావులు, చెక్ డ్యాములు, తోటలు, ఉద్యానవనాలు, నాడేప్ కంపోస్టు గుంతలు, అజోల్ల నిర్మాణం, పాఠశాల మరుగుదొడ్లు, భవన పైకప్పు వర్షపు నీరు నిల్వ నిర్మాణాలు, ఈత, తాటి చెట్ల నాటడం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం,గ్రామ పంచాయితీ భవనాలు, అంగన్ వాడీ భవనాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహాణ షేడ్లు, సి.సి. రోడ్లు, కమ్యూనిటీ నీరు నిల్వ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిపాలనా 2025-26 ఆర్థిక సంవత్సరానికి పనుల చర్య ప్రణాళిక ఖారారు చేసింది. ఈ ప్రణాళికలో మొత్తం 816 పనులకు రూ.33.42 కోట్లు రూపాయలు వ్యయం కేటాయించబడిందని ఆయన తెలిపారు. 

Read More రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో రాజ్యమేలుతున్న అవినీతి..

About The Author