నేటి నుండి పనుల జాతర ప్రారంభం
గ్రామీణాభివృద్ది జిల్లా అధికారి ఎం.శ్రీనివాస్ రావు
ములుగు జిల్లా :
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 22 నుండి "పనుల జాతర" కార్యక్రమం పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించబడుతుందని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి, ఎం. శ్రీనివాస్ రావు గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.
కమ్యూనిటీ శౌచాలయ సముదాయములు, పశువుల కొట్టాలు, కోల్లు, మేకల షెడ్లు, వ్యవసాయ బావులు, చెక్ డ్యాములు, తోటలు, ఉద్యానవనాలు, నాడేప్ కంపోస్టు గుంతలు, అజోల్ల నిర్మాణం, పాఠశాల మరుగుదొడ్లు, భవన పైకప్పు వర్షపు నీరు నిల్వ నిర్మాణాలు, ఈత, తాటి చెట్ల నాటడం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం,గ్రామ పంచాయితీ భవనాలు, అంగన్ వాడీ భవనాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహాణ షేడ్లు, సి.సి. రోడ్లు, కమ్యూనిటీ నీరు నిల్వ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిపాలనా 2025-26 ఆర్థిక సంవత్సరానికి పనుల చర్య ప్రణాళిక ఖారారు చేసింది. ఈ ప్రణాళికలో మొత్తం 816 పనులకు రూ.33.42 కోట్లు రూపాయలు వ్యయం కేటాయించబడిందని ఆయన తెలిపారు.