భారీ వర్షాలతో సోమవారం ప్రజావాణి రద్దు
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

అదిలాబాద్ జిల్లా బ్యూరో : జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో నీటి ముట్టడి, రహదారుల దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తడంతో సంబంధిత శాఖల అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం వచ్చే సోమవారం యథావిధిగా నిర్వహించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డిబిసిడిఓ సయ్యద్ రఫీక్, అసిస్టెంట్ బిసిడిఓ చక్రధర్, గౌడ సంఘం నాయకులు రాజా గౌడ్, పల్లె రమేశ్ గౌడ్, తిరుమల గౌడ్, బహుజన నాయకులు కొత్తపల్లి మల్లయ్య, శివరాములు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
