నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్

WhatsApp Image 2025-12-01 at 6.54.44 PM

ములుగు జిల్లా : 

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లోని సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులు నిర్ణీత గడువు లోపు శరవేగంగా పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ , ఆర్డీవో వెంకటేష్ తో కలసి  శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ విఐపి, వివిఐపి పార్కింగ్ స్థలాలను రహదారులను , గద్దెల ప్రాంగణ అభివృద్ధి పనులు , రెడ్డిగూడెం అంతర్గత రహదారులను వాటి పనుల పురోగతిని ఆర్డీవో వెంకటేష్ ను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈ ఈ అజయ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు 

About The Author

Related Posts