అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి..
- సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్

కామారెడ్డి జిల్లా :
Read More నేటి భారతం
Read More నూతన ఇంచార్జి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్వో)గా డా. ఎం. విద్యా రాణ్ వల్కర్
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తిరస్కరించడం అన్యాయం. రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడి వెంటనే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. మెచ్యూర్ పేరుతో వారాల తరబడి రైతులను కేంద్రాల్లో వేధించడం సరికాదు,” అని అన్నారు. తేమ శాతాన్ని పెంచి తడిసిన ధాన్యాన్ని సడలింపుతో కొనుగోలు చేయాలని, రైతులకు కనీసం పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
“రైతులు తమ జీవితాధారం అయిన పంటను రక్షించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తక్షణమే ముందుకు వచ్చి నష్టపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. లేనిపక్షంలో రైతులు నిరసనలకు దిగే పరిస్థితి వస్తుంది,” అని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, సభ్యులు, వెంకట్ గౌడ్, మోతి, రామ్ నాయక్, కొత్త నరసింహులు, ముదాం అరుణ్ కుమార్, దొడ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
15 Nov 2025
