అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి..

- సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్

WhatsApp Image 2025-10-26 at 5.43.45 PM

కామారెడ్డి జిల్లా : 

Read More నేటి భారతం

అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసి ముద్దయి రైతుల కష్టార్జిత పంట నష్టపోతున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

Read More నూతన ఇంచార్జి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్వో)గా డా. ఎం. విద్యా రాణ్ వల్కర్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు తమ రక్తం చెమటతో పండించిన వరి పంటను ఐకెపి కేంద్రాలకు తరలించి రాసులుగా వేసారని, పట్టాలు కప్పినప్పటికీ భారీ వర్షాలతో గాలులు వీచి పట్టాలు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసి ముద్దయిందని తెలిపారు. ఐకెపి కేంద్రాలలో సరైన వసతులు, భూమి సదుపాయాలు లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తిరస్కరించడం అన్యాయం. రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడి వెంటనే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. మెచ్యూర్ పేరుతో వారాల తరబడి రైతులను కేంద్రాల్లో వేధించడం సరికాదు,” అని అన్నారు. తేమ శాతాన్ని పెంచి తడిసిన ధాన్యాన్ని సడలింపుతో కొనుగోలు చేయాలని, రైతులకు కనీసం పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read More చిన్నారులకు గౌన్లను అందజేసిన ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి

“రైతులు తమ జీవితాధారం అయిన పంటను రక్షించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తక్షణమే ముందుకు వచ్చి నష్టపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. లేనిపక్షంలో రైతులు నిరసనలకు దిగే పరిస్థితి వస్తుంది,” అని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, సభ్యులు, వెంకట్ గౌడ్, మోతి, రామ్ నాయక్, కొత్త నరసింహులు, ముదాం అరుణ్ కుమార్, దొడ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Read More లింగంపేట మండలం ఎల్లారాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించిన జిల్లా కలెక్టర్

About The Author