బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుంది
బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు స్పష్ఠీకరణ

ఖమ్మం ప్రతినిది :
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్ సాధించేత వరకు ఉద్యమిస్తామని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు స్పష్టం చేశారు. గురువారం నాడు ఆయన ఖమ్మం జిల్లా మధిర సిపిఐ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవితో కలసి పాత్రికేయులతో మాట్లాడుతూ...
ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లతో పాటు చట్టసభలో 50% రిజర్వేషన్ సాధించేవరకు మడమ తిప్పని పోరాటం చేస్తామని, 56% గా ఉన్న బీసీలు ఐక్యమైతే గ్రామపంచాయతీ వార్డు మొదలుకొని ప్రధాని వరకు అందరూ బీసీలు అవుతారని బీసీలకు రాజ్యాధికారం చేతికి వస్తే బీసీలకు కావలసిన అన్ని రకాల చట్టాలు అమలు చేసుకుంటారనే విషయాన్ని ప్రతి బీసీ వ్యక్తి గమనించాలని, 2028 లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి బీసీ కూడా బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేసి బీసీల సత్తా చాటాలని అందుకు క్షేత్రస్థాయిలో ఉద్యమాల నిర్మాణo చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు
ఆయన వెంట బీసీ హక్కుల సాధన సమితి నాయకులు చిలకరాజు శ్రీనుకొమర్రాజు వెంకట్ బత్తిని శ్రీనివాస గౌడ్ ఉన్నారు
