ప్రజావాణి దరఖాస్తులకు పరిష్కారం చూపాలి.
ములుగు జిల్లా:

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 50 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు కు విన్నవిస్తూ అర్జీలను అందించారు. దరఖాస్తుల లో పేర్కొన్న సమస్యల పై క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో 50 దరఖాస్తులు రాగా అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 09, భూ సమస్యలు 08, ఉపాధి కల్పనకు 05, పెన్షన్ 05, ఇతర శాఖలకు సంబంధించినవి 23 దరఖాస్తులను కలెక్టర్ సంబంధిత అధికారులకు సరఫరా చేశారు.
ఈత కొట్టరాదని అన్నారు. జిల్లాలోని లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
వర్షాకాలం, వరదల దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు కంట్రోల్ రూమ్లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ, వర్షానికి, జలమాయమైయ్యే ప్రాంతాల సమస్య కు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
