వడ్త్య నరసింహ నాయక్ సేవలు చిరస్మరణీయం: కళ్లెం నవజీవన్ రెడ్డి
హయత్ నగర్:
బంజారా కాలనీ వ్యవస్థాపకులు, దివంగత శ్రీ వడ్త్య నరసింహ నాయక్ కాలనీ అభ్యున్నతికి చేసిన సేవలు మరువలేనివని హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కొనియాడారు. సోమవారం హయత్ నగర్ లోని బంజారా కాలనీలో నిర్వహించిన నరసింహ నాయక్ 14వ వర్ధంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముందుగా కాలనీవాసులతో కలిసి నరసింహ నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బంజారా కాలనీ అభివృద్ధికి నరసింహ నాయక్ గారు వేసిన పునాది ఎంతో పటిష్టమైనదని, ఆయన దూరదృష్టి వల్లే నేడు ఈ ప్రాంతం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని అన్నారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కాలనీ అభివృద్ధికి, స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని నవజీవన్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాలనీలోని మౌలిక వసతుల మెరుగుదలకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
కాలనీ ప్రతినిధులు బాలూ, కె. శంకర్, కె. జంజ్య, ఎం. రఘుపాపతి, కె. మోహన్, కె. భరత్, బి. చిరంజీవి, జి. బాలూ, జె. పంతు, ఎం. మోహన్, శంకర్, అమ్మాల్, శివ, బి. పణ్య, సకూరు, కె. లక్ష్మణ్, కైలాష్తో పాటు భారీ సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.
