
గుమ్మడిదల :
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీలోని సిజిఆర్ ట్రస్ట్ కార్యాలయంలో వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసిన సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ, పెరుగుతాయని తెలిపారు. యువత క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని, ట్రస్ట్ తరఫున క్రీడాకారులకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కుంటి మల్లేష్, బాబు యాదవ్, మురళి యాదవ్, అరవింద్ రెడ్డి, ప్రభాకర్ చారి, ఆగం యాదవ్, నవీన్ యాదవ్,క్రీడా అభిమానులు పాల్గొన్నారు.