*లేమూరులో ‘ట్వైలా ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్’ ప్రారంభం: ప్రకృతి ఒడిలో ప్రపంచ స్థాయి ఆరోగ్య కేంద్రం
*నగరవాసులకు మానసిక ఉల్లాసం, సహజసిద్ధ వైద్యం అందించడమే లక్ష్యం
*తుక్కుగూడ:
కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నగర జీవనానికి దూరంగా, ప్రకృతి ఒడిలో ఆహ్లాదాన్ని పంచేందుకు తుక్కుగూడ సమీపంలోని లేమూరులో సరికొత్తగా ‘ట్వైలా ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్’ (Twyla Farms and Resorts) ఏర్పాటయింది. నిర్వాహకుడు రామకృష్ణ రాజు (బ్యాంక్ రాజు) తన చిన్ననాటి స్నేహితులైన ప్రముఖులతో కలిసి ఈ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.
*ప్రముఖుల సమక్షంలో వైభవంగా ప్రారంభోత్సవం
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దేవనాథ రామానుజ జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరై, ఆశీస్సులు అందజేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, కర్ణాటక శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) తిప్పన్న కంకనూర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ ఈ వేడుకలో పాల్గొని రిసార్ట్స్ ప్రాంగణాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. కేవలం వినోదం, విడిది కోసమే కాకుండా, ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు ఇక్కడ ప్రపంచ స్థాయి ‘ఆరోగ్య కేంద్రాన్ని’ (వెల్నెస్ సెంటర్) ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆధునిక ఒత్తిళ్లతో సతమతమవుతున్న నగరవాసులకు ఇలాంటి కేంద్రాలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.
*రసాయన రహిత హరిత వాతావరణం"
ఎలాంటి పురుగుమందులు (ఫెస్టిసైడ్స్) వాడకుండా, పూర్తిగా సహజసిద్ధమైన పద్ధతుల్లో ఈ ఫామ్ను అభివృద్ధి చేయడం గొప్ప విషయం. పర్యావరణాన్ని కాపాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు ఇలాంటి రిసార్ట్స్ ఎంతో దోహదపడతాయి."
*మధుయాష్కీ గౌడ్, మాజీ ఎంపీ


