క్రీడలు
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... క్రీడలు సమైక్యతకు చిహ్నం...
Published On
By Bharatha Sakthi Desk
29 వ వార్డులో ఉత్సహాంగా ముగిసిన క్రీడలు సూర్ణపు సావిత్రమ్మ స్ఫూర్తితో సంక్రాంతి సంబరాలు గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు బహుకరణ మాజీ జాతీయ కోకో క్రీడాకారుడు, మా అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రమ్ 69వ ఎస్ జి ఎఫ్ అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలు
Published On
By Bharatha Sakthi Desk
పినపాక : రాష్ట్రంలో స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్.జి.ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 69వ అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీల్లో భాగంగా గురువారం జరిగిన రెండో రోజు కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగి క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో వివిధ రాష్ట్రాలు, జాతీయ స్థాయి విద్యా సంస్థల జట్లు అత్యంత పోటీతత్వంతో తలపడుతూ... బంగారు పతక విజేత సయ్యద్ హుస్సేన్ కు అభినందనలు..
Published On
By Bharatha Sakthi Desk
పోరుమామిళ్ళ (భారత శక్తి ప్రతినిధి )జూలై 30:పోరుమామిళ్ల పట్టణంలోని హోలీ రోజరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సయ్యద్ హుస్సేన్ అనే విద్యార్థి,విజయవాడలోని సి ఆర్ కే ఇండోర్ స్టేడియంలో జరిగిన నేషనల్ ఓపెన్ బిగినర్స్ టైక్వాండో ఛాంపియన్షిప్ 2025 అండర్ 57 కేటగిరి విభాగంలో బంగారు పతకాన్ని సాధించినందుకు గాను పాఠశాల... కిక్ బాక్సింగ్ లో సగిలేరు విద్యార్థుల ప్రతిభ
Published On
By Bharatha Sakthi Desk
పోరుమామిళ్ల (భారత శక్తి ప్రతినిధి)జూలై 29: డాకిక్ బాక్సింగ్ లో అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడవ ఇంటర్ జిల్లా కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షి ప్ నేషనల్ సెలక్షన్, JVS స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో బద్వేల్ లోని సరస్వతి ఇంగ్లీష్ మీడియం స్కూలులో, సగిలేరు గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించారని ప్రిన్సిపాల్ నిరంజన్ వరప్రసాద్, వైస్... కరాటేతో ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది
Published On
By Bharatha Sakthi Desk
వేములవాడ, జూన్ 11(భారత శక్తి) : కరాటేతో ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పట్టణ సీఐ వీరప్రసాద్ అన్నారు. బుధవారం మహదేవ్ ఫంక్షన్ హాల్ లో ఓకినవా సీనియర్ కరాటే మాస్టర్ అబ్దుల్ మన్నన్ సమ్మర్ క్యాంప్ లో శిక్షణ పొందిన విద్యార్థులకు కరాటే గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పలు రకాల బెల్ట్స్ సాధించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ పట్టణ సిఐ బి.వీరప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కరాటేలో శిక్షణ పొందడం వల్ల ధ్యానం, యోగ, ప్రాణాయామం వంటి అంశాల్లో ప్రభావితమై సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని వివరించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడం వల్ల వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు.కరాటేకి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులతో పాటు గత 35 సంవత్సరాల నుండి రాజన్న జిల్లాలో విద్యార్థిని విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తూ జాతీయ స్థాయి,అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులకు మెడల్స్ అందిస్తున్నా మన్నాన్ సేవలు అభినందనీయమని కొనియాడి, మాస్టర్ మన్నాన్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు మైలారం రాము మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వల్ల విద్యార్థిని,విద్యార్థినీలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని,అమ్మాయిలు తమను తాము రక్షించుకోవడానికి కరాటే ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.అలాగే పిల్లలకు ఉద్యోగాల్లో క్రీడా కోటలో రెండు శాతం రిజర్వేషన్ లభిస్తుందని తెలిపారు.ఈకార్యక్రమంలో కరాటే కోచ్లు లోలోపు రాజు, కనికరపు రాజశేఖర్, అనుగుల వర్షిత్, ప్రతాప రిషిక్ తేజ, గుడిసె సూర్య, జయచంద్ర పాల్గొన్నారు . జాతీయ క్రీడల్లో రాణించిన మహిళ కానిస్టేబుల్ను అభినందించిన సిపి
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)మే21: జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్రీడలో రాణించిన ఆర్మూడ్ రిజర్వ్ మహిళా కానిస్టేబుల్ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం అభినందించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మూడ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న జి.స్పందన గత నెల పంజాబ్ రాష్ట్రం జలందర్ నిర్వహించిన మొదటి ఆల్ఇండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ 2024 – 25 క్రీడా పోటీల్లో ఫెన్సింగ్ క్రీడలో సినియాన్ వుమెన్స్ టీం ఫాయిల్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలసిన స్పందనను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించే పోలీస్ సిబ్బందికి పూర్తి సహాకారాన్ని అందించడం జరుగుతుందని. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సహకాలు వుంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ కార్యక్రమములో పరిపాలన విభాగం అదనపు డిసిపి రవి, ఏ.ఆర్ ఏసిపి అంతయ్య పాల్గోన్నారు. CSK vs RR Toss: టాస్ నెగ్గిన రాజస్థాన్.. మోత మోగించడం ఖాయం!
Published On
By Bharatha Sakthi Desk
చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మొదలైపోయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ నెగ్గిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. దీంతో ధోని సేన మొదట బ్యాటింగ్కు దిగనుంది. ఇతర మైదానాలతో పోల్చుకుంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో బౌండరీ సైజ్ తక్కువ. కాబట్టి చేజింగ్ చేయాలనే ఉద్దేశంతో సంజూ మొదట బౌలింగ్ ఎంచుకోవచ్చు. కానీ బిగ్ స్కోర్ సెట్ చేసి ఇస్తే సీఎస్కేను మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకు అవకాశం ఉండేది. అసలే ఈ సీజన్ మొత్తం చేజింగ్లో ఇబ్బందులు పడుతూ వచ్చింది ధోని సేన. సరైన ఫినిషర్లు లేకపోవడం, ఉన్న బ్యాటర్లూ ధనాధన్ ఇన్నింగ్స్లు ఆడటంలో ఫెయిల్ అవడం ఆ టీమ్కు మైనస్గా మారింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ బౌలింగ్ చేయాలని డిసైడ్ అవడం కొంత ఆశ్చర్యకరమనే చెప్పాలి. దంచి కొడతారా? టాస్ ఓడిన చెన్నైకి తమ బ్యాటింగ్ పవర్ను నిరూపించేందుకు ఇదే బెస్ట్ చాన్స్ అని చెప్పాలి. ఓపెనర్లు ఆయుష్ మాత్రే, డెవిన్ కాన్వే దగ్గర నుంచి శివమ్ దూబె వరకు బిగ్ నాక్స్ ఆడాల్సిన సమయమిది. సీజన్ ఎలాగూ పోయింది కాబట్టి ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫియర్లెస్ అప్రోచ్తో ఆడాలి. బౌండరీ సైజ్ చిన్నదే కాబట్టి భారీ షాట్లతో విరుచుకుపడాలి. ఒకవేళ ఎల్లో ఆర్మీ గనుక చెలరేగి ఆడితే మ్యాచ్ రసవత్తరంగా మారొచ్చు. ఎందుకుంటే ప్రత్యర్థి జట్టులో సూర్యవంశీ దగ్గర నుంచి హిట్మెయిర్ వరకు చాలా మంది పించ్హిట్టర్లు ఉన్నారు. మరి.. సీఎస్కే ఎలా బ్యాటింగ్ చేస్తుందో చూడాలి. Ayush Mhatre: రాజస్థాన్ను భయపెట్టిన మాత్రే.. ఏం బాదాడు భయ్యా!
Published On
By Bharatha Sakthi Desk
రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ ఆయుష్ మాత్రే చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా బౌండరీల మీద బౌండరీలు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టాడీ 17 ఏళ్ల బ్యాటర్. 20 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు మాత్రే. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. 215 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన ఆయుష్.. తుషార్ దేశ్పాండే, యుధ్వీర్ సింగ్ను చావబాదాడు. చెత్త బంతుల్ని శిక్షించడమే గాక మంచి డెలివరీస్ను కూడా బౌండరీకి తరలించాడతను. అయితే మాత్రే ఔట్ అవడంతో సీఎస్కే ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. పెవిలియన్కు క్యూ! ఆరంభంలో డెవిన్ కాన్వే, ఉర్విల్ పటేల్ ఇద్దరూ త్వరగానే ఔట్ అయ్యారు. 12 పరుగులకే వీళ్లు పెవిలియన్ చేరారు. అయినా భయపడకుండా సీనియర్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (13) సాయంతో హిట్టింగ్కు దిగాడు ఆయుష్ మాత్రే. అయితే అతడు ఔట్ అవడంతో చెన్నై బ్యాటింగ్ భారీ కుదుపునకు లోనైంది. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (1)తో పాటు అశ్విన్ వెంటవెంటనే ఔట్ అయ్యారు. దీంతో 2 వికెట్లకు 67 పరుగులతో ఉన్న టీమ్ కాస్తా 5 వికెట్లకు 78 పరుగులతో తీవ్ర కష్టాల్లో పడింది. ప్రస్తుతం డెవాల్డ్ బ్రేవిస్ (9 నాటౌట్), శివమ్ దూబె (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరూ ఎంత సేపు క్రీజులో ఉంటారనే దాన్ని బట్టే సీఎస్కే భారీ స్కోరు ఆశలు ఆధారపడి ఉన్నాయి. కెప్టెన్ ధోని ఇంకా బ్యాటింగ్కు రాలేదు. చివర్లో మాహీ హిట్టింగ్కు దిగక తప్పదు. మరి.. చెన్నై ఎంత స్కోరు చేస్తుందో చూడాలి. LSG vs PBKS: లక్నోను కట్టడి చేసిన పంజాబ్ కింగ్స్.. స్కోర్ ఎంత చేశారంటే..
Published On
By Bharatha Sakthi Desk
ఐపీఎల్ 2025లో 13వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ క్రమంలో ఆటకు దిగిన లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బాటింగ్లో కష్టాలు లక్నో జట్టు మొదటి వికెట్ కోల్పోయి ప్రారంభించినప్పటికీ, తరువాత పరిస్థితి అంత సులభంగా కనిపించలేదు. మిచెల్ మార్ష్ మొదటి ఓవర్లోనే అవుట్ కావడం, జట్టును కొంత ఇబ్బంది పెట్టింది. ఆ క్రమంలో 3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి, లక్నో స్కోరు 20 పరుగుల వద్ద నిలిచింది. ఇక, ఐడెన్ మార్క్రమ్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి ఔట్ అవ్వడంతో, మరోసారి లక్నోకు ఎదురుదెబ్బ తగిలింది. రిషబ్ పంత్ కూడా 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవడం, లక్నో జట్టుకు మరో షాక్ ఇచ్చింది. హెల్ప్ఫుల్ ఇన్నింగ్స్ అయినా నికోలస్ పూరన్ తన అద్భుత బ్యాటింగ్తో జట్టును నిలబెట్టాడు. 30 బంతుల్లో 44 పరుగులతో, పూరన్ ఆకట్టుకున్నప్పటికీ, నికోలస్ పూరన్ 4వ వికెట్గా ఔట్ అయ్యాడు. లక్నో స్కోరు 91/4గా నిలిచింది. ఈ క్రమంలో 15 ఓవర్లకు ముగిసే సమయానికి, లక్నో జట్టు 4 వికెట్ల నష్టంతో 116 పరుగులు చేసింది. అదే క్రమంలో లక్నోకు ఐదవ దెబ్బ తగిలింది. డేవిడ్ మిల్లర్ 19 పరుగులు చేసిన తర్వాత మార్కో జెన్సన్ బౌలింగ్లో ఔటయ్యాడు. సమద్ కూడా.. ఆయుష్ బడోని రూపంలో లక్నోకు ఆరో షాక్ తగిలింది. ఆయుష్ బడోని 41 పరుగులు చేసిన తర్వాత అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత అబ్దుల్ సమద్ రూపంలో లక్నో ఏడవ దెబ్బను ఎదుర్కొంది. 27 పరుగులు చేసిన తర్వాత అబ్దుల్ సమద్ను అర్ష్దీప్ సింగ్ అవుట్ చేశాడు. దీంతో లక్నో చివరకు 20 ఓవర్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక పంజాబ్ తరఫున అర్షదీప్ సింగ్ 3 వికెట్లు, ఫెర్గూసన్, మ్యాక్సెవెల్, జాన్సల్, చాహల్ తలో వికెట్ తీశారు. కలయిక IPL 2025, PBKS vs LSG: పంజాబ్ సూపర్ విక్టరీ.. లఖ్నవూపై సునాయాస విజయం
Published On
By Bharatha Sakthi Desk
పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో (IPL 2025) తన హవా కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ తాజా మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్పై (PBKS vs LSG) సునాయాస విజయం సాధించింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (69) మెరపు అర్థశతకం సాధించడంతో వార్ వన్సైడ్గా మారిపోయింది. వరుసగా రెండో మ్యాచ్లో కూడా శ్రేయస్ అయ్యర్ (52 నాటౌట్) అర్ధశతకం సాధించాడు. నేహల్ వధేరా (43 నాటౌట్) కూడా సమయోచితంగా రాణించడంతో ఈ సీజన్లో పంజాబ్ వరుసగా రెండో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని నిలబెడుతూ పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. నికోలస్ పూరన్ (44), ఆయుష్ బదోనీ (41) చెప్పుకోదగ్గ స్కోరు సాధించారు. మార్క్రమ్ (28), అబ్దుల్ సమద్ (27) విలువైన పరుగులు చేశారు. దీంతో లఖ్నవూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (2) మరోసారి విఫలమయ్యాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. ఫెర్గూసన్, మ్యాక్స్వెల్, జాన్సన్, ఛాహల్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఆరంభంలోనే ప్రియాంశ్ ఆర్య (8) వికెట్ కోల్పోయింది. అయితే ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ అద్భుత హాఫ్ సెంచరీలతో పంజాబ్ను విజయతీరాలకు చేర్చారు. చివర్లో నేహల్ వధేరా వేగంగా ఆడాడు. దీంతో పంజాబ్ 16.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దిగ్వేశ్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. బ్యాడ్మింటన్ కాంస్య పతకం సాధించిన పల్లెం రాజాలింగు.
Published On
By Bharatha Sakthi Desk
మందమరి టౌన్, మార్చ్ 26 (భారత శక్తి): ఇటీవల గోవాలో జరిగిన జాతీయ వెటరన్ బ్యాడ్మింటన్ పోటీలలో మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన పల్లెం రాజలింగు మాజీ సింగరేణి కార్మికుడు పాల్గొని కాంస్య పతకం సాధించారు. 75 సంవత్సరాల విభాగం డబుల్స్ పోటీలో విజేతగా నిలిచి కాంస్య పతకం అందుకున్నారు. జాతీయ స్థాయిలో గెలుపొందిన పల్లెం రాజాలింగు వచ్చే నెల అంతర్జాతీయ స్థాయిలో థాయిలాండ్ లో జరుగనున్న పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజలింగు మాట్లాడుతూ గతంలో రెండుసార్లు అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యారని 75ఏళ్ల వయస్సులో ఆడే అవకాశం సత్తా ఉన్న ఆర్ధిక స్థోమత లేక వెళ్ళకపోయినట్లు తెలిపారు. క్రీడాకారులను మెడల్స్ తో అభినందించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్
Published On
By Bharatha Sakthi Desk
కరీంనగర్, ఫిబ్రవరి 28(భారత శక్తి): ఆల్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీలు బెంగుళూరులో జరుగగా తెలంగాణ రాష్టం నుండి ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ నగరానికి చెందిన షేక్ జియా హుస్సేన్, మహమ్మద్ సజ్జాద్ టైటిల్, బ్లాక్ బెల్టు సాధించగా శుక్రవారం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారిని శాలువాలతో సత్కరించారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన జూనియర్ మిస్టర్ ఇండియా టైటిల్ ను షేక్ జియ హుస్సేన్ గెల్చుకోగా, హైదరాబాదులో జరిగిన ఆల్ ఇండియా కరాటే పోటీల్లో మహమ్మద్ సజ్జాద్ బ్లాక్ బెల్ట్ సాధించారు. శుక్రవారం కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, మాజీ కార్పొరేటర్లు వాల రమణారావు, దిండిగాల మహేష్, తోట రాములు, బోనాల శ్రీకాంత్, నాయకులు గందె మహేష్, కర్ర సూర్య శేఖర్, ఆసిమ్ తదితరులు ఉన్నారు. 