బిజెపి బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక ఎన్నికలవేళ షాక్ భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరిక

WhatsApp Image 2025-12-05 at 5.20.29 PM

కామారెడ్డి జిల్లా : 
బీజెపి, బిఆర్ఎస్ పార్టీల నుండి పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిప్పాపూర్, బిక్నూర్, గ్రామాల నుండి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  కాంగ్రెస్ పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ  మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం, స్థానిక అభివృద్ధి పనులకు ఆకర్షితులై  శుక్రవారం తమ పార్టీలను వదిలేసి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

Read More కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆవాల సరోజ మృతి

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 'అభయహస్తం' (ఆరు గ్యారెంటీలు) వంటి సంక్షేమ పథకాలు ప్రజల మద్దతును కూడగట్టడంతో పాటు, ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆకర్షిస్తున్నాయని  తెలిపారు. జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బిక్కనూరుకు చెందిన రాజబాబు గౌడ్, బిజెపి నాయకులు కార్యకర్తలు 150 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Read More రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

About The Author