నిన్నటి వరకు ఒక లెక్క.. నేటి నుండి మరో లెక్క!

  • ​రాజకీయ కుట్రల కోటలు బద్ధలు.. లిక్కర్ కేసులో ధర్మమే గెలిచింది!
  • ​అసత్యపు అస్త్రాలు తుత్తునియలు - క్లీన్ చిట్ తో బయటపడ్డ అసలు నిజం
  • ​నిర్ణయాత్మక పోరాటం దిశగా 'సరికొత్త వ్యూహం' - కప్పాటి పాండురంగారెడ్డి.

నిన్నటి వరకు ఒక లెక్క.. నేటి నుండి మరో లెక్క!

హైదరాబాద్:


"బురద చల్లడమే పనిగా పెట్టుకున్న రాజకీయ ప్రత్యర్థులకు కాలం చెల్లింది. అబద్ధాల పునాదులపై నిర్మించిన కుట్రల సౌధం కుప్పకూలిపోయింది" అని ప్రముఖ నాయకులు కప్పాటి పాండురంగారెడ్డి ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాం అనేది కేవలం రాజకీయ ప్రేరేపిత కక్షసాధింపు చర్య అని న్యాయస్థానం తేల్చిచెప్పడంతో సత్యం బహిర్గతమైందని ఆయన స్పష్టం చేశారు. నిన్నటి వరకు హేళన చేసిన నోళ్లకు ఈ తీర్పు చెంపపెట్టు అని ఆయన విమర్శించారు.

​అభాండాల పర్వం.. అపహాస్యాల ముగింపు:

​గత కొంతకాలంగా తమను రాజకీయంగా దెబ్బతీయడానికి 'లిక్కర్ కేసు'ను ఒక బ్రహ్మాస్త్రంలా వాడుకున్నారని పాండురంగారెడ్డి మండిపడ్డారు. ఏ చర్చ జరిగినా, ఏ వేదికపైనైనా ఈ నిరాధారమైన ఆరోపణలను సాకుగా చూపి అపహాస్యం చేసే ప్రయత్నం చేశారని, ఎంత నిజాయితీగా ఉన్నా రాజకీయంగా ఎదుర్కోలేక అప్రతిష్ఠ పాలు చేయాలని కుట్రలు పన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఇప్పుడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని, అంతా పాజిటివ్ వైబ్ నెలకొందని ధీమా వ్యక్తం చేశారు.

సమర శంఖం.. సరికొత్త వ్యూహం!

​"సత్యమేవ జయతే" అనేది కేవలం మాట కాదు, అది ఈ తీర్పుతో మరోసారి నిరూపితమైందని పాండురంగారెడ్డి అన్నారు. తమపై ఉన్న నెగెటివ్ నరేషన్ అంతమైందని, ఇకపై నిర్ణయాత్మక పోరాటం దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు. ప్రత్యర్థుల కుతంత్రాలను తిప్పికొడుతూ, ప్రజాక్షేత్రంలో సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతామని, ఈ విజయం తమ కార్యకర్తలకు కొండంత అండ అని ఆయన ఉద్ఘాటించారు.

About The Author