
కామారెడ్డి :
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు కామారెడ్డి 23వ జిల్లా మహాసభలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 28వ తేదీన నిర్వహించడం జరిగిందని, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో పిడిఎస్యు బలమైన విద్యార్థి ఉద్యమాలను నిర్మించినందుకు రామారెడ్డి మండలానికి చెందిన తనను జిల్లా ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు రాకేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో నియమించినందుకు బాధ్యతతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామన్నారు. అనంతరం జిల్లా కమిటీ సభ్యులు ఈ బాధ్యత అప్పజెప్పినందుకు హర్షం వ్యక్తం చేశారు.