
ఉమ్మడి వరంగల్ :
హన్మకొండ జిల్లా వర్దన్నపేట నియోజకవర్గం పరిధిలోని హాసన్ పర్తి మండల్ సుధన్ పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తిక్క మాదవి ప్రశాంత్ టీవీ రిమోట్ గుర్తు పైన సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి గెలుపొందడానికి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు, అనంతరం సర్పంచ్ అభ్యర్థి తిక్క మాదవి ప్రశాంత్ మాట్లాడుతూ సుధన్ పల్లి.గ్రామ సర్పంచ్ గా నన్నే గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అయిన తిక్క మాధవి ప్రశాంత్ అన్నారు. చదువుకున్న వ్యక్తిగా యువత గ్రామ ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పం తో ఎమ్మెల్యే నాగరాజు ఆదేశానుసారం పోటీ చేస్తున్నాని తెలిపారు. మీ ఇంటి బిడ్డ గా వస్తున్నా, మీ కష్ట సుఖాలలో పాలు పంచు కుంటా, మీ సమస్యలే నా సమస్యగా భావిస్తా, అభివృద్ధి నా లక్ష్యం. మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపిస్తే సుధన్ పల్లి గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను అని అన్నారు.ఈనెల డిసెంబర్ 14 న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ అమూల్య మైన ఓటు వేసి గెలిపిచాలి అని కోరారు.