హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ పార్థివ దేహానికి నివాళులర్పించిన సీపీ

WhatsApp Image 2025-12-10 at 6.37.21 PM

కరీంనగర్ : 

గుండెపోటుతో మరణించిన కరీంనగర్ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఎర్రోజు దేవేందర్(53) పార్థివ దేహానికి కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం బుధవారం నివాళులర్పించారు. కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలోని దేవేందర్ నివాసానికి చేరుకున్న సీపీ  పార్థివ దేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ దేవేందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబానికి,  కుమారులకు ధైర్యం చెప్పారు. కమీషనర్‌తో పాటు ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి, ఇన్స్పెక్టర్ కరీముల్లాఖాన్, ఆర్.ఐ. కిరణ్ కుమార్ లతో పాటు కమీషనరేట్‌కు చెందిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులు కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. 

About The Author