క్రీడలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం

- టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
-.బాస్కెట్బాల్ విజేతలకు బహుమతుల ప్రధానం

WhatsApp Image 2025-12-01 at 7.04.45 PM

సంగారెడ్డి : 

క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలో 11వ అంతర్ జిల్లా సీనియర్ బాస్కెట్బాల్ ముగింపు వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పురుష మహిళా క్రీడాకారులు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్నారు. ఈ సందర్భంగా అంతర్ జిల్లా బాస్కెట్బాల్ పోటీల్లో పురుషుల విభాగంలో ప్రథమ విజేతలుగా నిలిచిన హైదరాబాద్ జిల్లా జట్టుకు, ద్వితీయ స్థానంలో నిలిచిన రంగారెడ్డి, తృతీయ స్థానంలో నిలిచిన మేడ్చల్ జిల్లా జట్టుకు బహుమతులు అందజేశారు. మహిళల విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన మేడ్చల్ మల్కాజిగిరి, ద్వితీయ స్థానంలో నిలిచిన హైదరాబాద్ జిల్లా, తృతీయ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా జట్లకు ఆమె  ట్రోఫీతో పాటు మెడల్స్ బహుకరించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులను జట్లను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పృద్వేశ్వర్ రెడ్డి మెదక్ జిల్లా బాస్కెట్బాల్ అధ్యక్షుడు రమేష్ రాష్ట్ర కోశాధికారి చంద్రశేఖర్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ కాంగ్రెస్ నాయకులు సంతోష్, శ్రీకాంత్ గౌడ్ క్రీడాకారులు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. 

About The Author