ఇండ్లు లేని పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జూపల్లి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
ఇండ్లు లేని పేదలందరికీ సొంత ఇంటి కలను నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇంటిలేని పేద కుటుంబాల కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి అర్హ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. పేదల గృహసాధన లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులను శాలువాలతో సన్మానించారు. ప్రారంభోత్సవంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
03 Mar 2026
