చోరికి గురైన 71 సెల్ ఫోన్లను తిరిగి అప్పగించిన నిర్మల్ పోలీసులు..
మొబైల్ ఫోన్ పోయిన, చోరికి గురైనా www.ceir.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలి.
జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 71 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1806 ఫోన్లు (సుమారుగా రెండు కోట్ల పదహారు లక్షల డెబ్భై రెండు వేల రూపాయల విలువ గల ఫోన్లను) రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠినంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు.వినియోగ దారులు,సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు అవి ఎక్కడి నుండి వచ్చినవి, చోరీకి గురైనవో కాదో సరిచూసుకోవాలని, అనుమానం ఉన్న ఫోన్లను కొనరాదని తెలిపారు. అంతేకాకుండా ఒకే వ్యక్తి వద్ద లేదా కొద్ది మంది వద్ద పెద్ద సంఖ్యలో మొబైల్స్ దొరికితే, వారు ఏదైనా చోరీ ముఠా లేదా అనుమానాస్పద కార్యకలాపాలలో భాగమా అనే దానిపై సమగ్ర విచారణ చేయాలని అడిషనల్ ఎస్పీకి ప్రత్యేక సూచనలు ఇచ్చారు. CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
