
సంగారెడ్డి :
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండవ రోజు సైతం పెట్టుబడుల వరద కొనసాగింది. సమ్మిట్ రెండవ రోజున తెలంగాణ రాష్ట్రానికి వివిధ రంగాలలో ₹1,11,395 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. మొత్తం రెండు రోజుల్లో కలిపి సుమారు ₹3 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి.
రెండవ రోజు రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, అరబిందో ఫార్మా, హెటెరో, మరియు భారత్ బయోటెక్ వంటి ప్రధాన సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. లంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ: రాష్ట్ర ప్రభుత్వం యొక్క 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో రూపొందించిన 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు.