మొదటి విడత ఎన్నికల ప్రచార గడువు ముగింపు...
ఆరు మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు..మద్యం దుకాణాలు మూసివేత..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
జిల్లాలో ఈనెల పదకొండవ తేదీన (గురువారం) జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ప్రచారంపై అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలి విడత ఎన్నికలు జరిగే ఆరు మండలాలు అయిన దస్తురాబాద్, ఖానాపూర్, పెంబి, కడెం, లక్ష్మణచందా, మామడల పరిధిలో నేటి సాయంత్రం ఐదు గంటల (17:00 గం.లు) వరకు తప్పనిసరిగా అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలని స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత బహిరంగ ప్రచారానికి అనుమతి ఉండదు.
About The Author
03 Mar 2026
