పంచాయితీ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరగడానికి మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకం

కామారెడ్డి జిల్లా :
ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి హాజరై సూచనలు అందించారు. అబ్జర్వర్ల బాధ్యతలు, ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనుసరించాల్సిన నిబంధనలపై వివరణాత్మకంగా మార్గనిర్దేశం చేశారు.
Read More నేటి భారతం :
సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల విధానాలు, పోలింగ్ ప్రక్రియ, ఎలక్టోరల్ రూల్స్, మోడల్ కోడ్ ఆఫ్ కన్డక్ట్ పాటించడం వంటి అంశాలపై వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి అబ్జర్వర్ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ విభాగాల నుంచి ఎంపికైన మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మదన్ మోహన్, డిపిఓ మురళీ, డిపిఎల్ఓ శ్రీనివాస్, , తదితరులు పాల్గొన్నారు.
About The Author
11 Dec 2025
