మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదు..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని.

WhatsApp Image 2025-12-09 at 6.07.03 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో : 

Read More స్థానిక ఎన్నికల బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం

మొదటి విడత గ్రామపంచాయితీ ఎన్నికలను ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు.మంగళవారం సాయంత్రం మొదటి విడత గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అబ్జర్వర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాల వారిగా మొదటి విడత ఎన్నికలు నిర్వహించే సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలు, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల వివరాలను ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కొరకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల సామాగ్రి పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించాలని అన్నారు. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా పూర్తిచేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, రెండు వందల మీటర్ల పరిధిలో అనధికార వ్యక్తులు ఉండకుండా చూడాలన్నారు. ఉపసర్పంచ్ ఎన్నికలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిచేయాలన్నారు.
        
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఆరు మండలాల్లో 120 గ్రామ పంచాయతీ స్థనాలకు మొదటి దశ  ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. సూక్ష్మ పరిశీలకులు, పిఓ, ఓపిఓ, ఇతర అధికారులను అవసరానికి అదనంగా నియమించుకోవడంతో పాటు, వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. సరిపడినంత పోలింగ్ సామాగ్రి అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సామాగ్రి పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
             
గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం మాట్లాడుతూ, మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే దాదాపు ఓటరు స్లిప్ ల పంపిణీని పూర్తి చేశామని అన్నారు. ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్ చేసేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. 
       
జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, మొదటి దశ గ్రామ పంచాయితీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 
      
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏఎస్పీ ఉపేంద్రా రెడ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, డిపిఓ శ్రీనివాస్, డీఈఓ భోజన్న, జెడ్పీ సీఈవో శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Read More భూ నిర్వాసితులపై చిన్న చూపు చూస్తున్న సింగరేణి యాజమాన్యం.

About The Author