నిరుద్యోగుల సంఖ్య తగ్గించడానికి ఈ జాబ్ మేళా
40 వేల పై చిలుకు అభ్యర్థుల నమోదు
జాబ్ మేళాలో పాల్గొన్న 275 పరిశ్రమలు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట :
నిరుద్యోగులకు ఉపాధి కల్పనకై కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రవైట్ రంగంలోనూ ఉపాధి కల్పించేందుకే ఈ మేఘా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.అందులో భాగంగానే ముందెన్నడూ లేని రీతిలో ప్రప్రథమంగా మారు మూల ప్రాంతం హుజుర్నగర్ లో మేఘా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.పరిశ్రమల శాఖాకు అనుబంధంగా ఉన్న డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణా, సింగరేణి కాలరీస్ సహకారంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేఘా జాబ్ మేళా కార్యక్రమాన్ని హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఉదయం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్,శాసనసభ్యులు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి,డి.ఐ. జి ఎల్.ఎస్ చౌహన్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్.పి నరసింహా, నల్గొండ ఎస్.పి శరత్ చంద్ర పవార్,ఖమ్మం కమిషనర్ సునీల్ దత్ లతో పాటు డి ఈ ఈ టి డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి,అడిషనల్ కార్పొరేట్ రిలేషన్ డైరెక్టర్ వంశీదర్ రెడ్డి,సింగరేణి కాలరీస్ ప్రతినిధి చంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హుజుర్నగర్ లో నిర్వహిస్తున్న మేఘా జాబ్ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగులు తరలిరాగా అదే స్థాయిలో 275 పరిశ్రమలు ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు తరలి రావడం శుభపరిణామమని ఆయన అభివర్ణించారు.జాబ్ మేళాలో పాల్గొనేందుకు 40 వేల పై చిలుకు అభ్యర్థులు తమ తమ పేర్లు నమోదు చేసుకోవడంతో పెరిగిన సంఖ్యను దృష్టిలో పెట్టుకొని రెండో రోజుకు కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.అందుకు గాను అల్పాహారం మొదలు బోజనాది సౌకార్యాలను ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.పేర్లు నమోదు చేసుకున్న ప్రతిబొక్కరికి ఆయా కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొనేందుకు వెసులుబాటుగా ఉంటుందన్న కోణంలొనే రెండో రోజుకు పొదగించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.సమాజానికి సవాల్ గా మారిన నిరుద్యోగ సమస్య నిర్ములనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 20 నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ల సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో 70 వేల నుండి 75 వేల ఉద్యోగాలను భర్తీ చేసామని ఆయన గుర్తుచేశారు.తాజాగా గ్రూప్-1,గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ కుడా అందులో భాగమే నన్నారు.పట్టణ ప్రాంత యువతకు సరిసమానంగా గ్రామీణ ప్రాంత యువతీ,యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న దృఢ సంకల్పంతోటే మేఘా జాబ్ మేళా కార్యక్రమాన్ని మారుమూల ప్రాంతం అయిన హుజుర్నగర్ లో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.గోండు గూడెంలో దళిత వాడల్లో బి సి బస్తీల్లో ఉన్న నిరుపేదలతో పాటు మైనారిటీ ఇ. బి.సి ల కళ్ళలో వెలుగులు నింపాలి అన్న సదుద్దేశంతోటే ఎన్ని వ్యయప్రయాసాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఈ మేఘా జాబ్ మేళా కార్యక్రమానికి అంకురార్పణ చుట్టామన్నారు.స్థానిక పరిశ్రమలతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలతో తానే స్వయంగా సంప్రదించి జాబ్ మేళాలో పాల్గొనేందుకు అంగీకరింప చేశామన్నారు.
