పదవ తరగతిలో అనాథ గృహ విద్యార్థుల ఉత్తమ ఫలితాలు
ఎల్బీనగర్:
ఆర్కేపురం చిత్రా లేఅవుట్ లోని అనాథ విద్యార్థి గృహ విద్యార్థులు పదవ తరగతిలో మొత్తం 11 మందిలో అందరూ డిస్టింక్షన్,మొదటి తరగతులలో ఉత్తీర్ణత సాధించారు.ఆ విద్యార్థులు పి.గోపి 91%వి. మహేష్ 91 % ఎమ్. శ్రీవర్ 90% టి. గోవర్ధన్ 88 % పి. హర్ష 87%, ఎ.బన్నీ 83 % ఎమ్. శ్రీకర్ 81 %, యు.రాకేష్ 74 % ఎమ్. రోహిత్ 69 %, ఎ. సన్నీ 65 యు.రమేష్ -- 64 % మార్కులతో సత్తా చాటారు.ఈ విద్యార్థులకు ఎలాంటి ఫీజులు తీసుకోకుండా పూర్తిగా ఉచిత ప్రవేశాలు కల్పించిన, శ్రీ ఆదిత్య కాన్సెప్ట్ స్కూల్,శ్రీ విద్యా, ఎన్ఆర్ఐ, లోటస్ లాప్, న్యూ తక్షశిల, తక్షశిల పాఠశాలల యాజమాన్యాలకు అనాథ విద్యార్థి గృహం తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా 90 % పైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు,అనాథ గృహ అధ్యక్షులు మార్గం రాజేష్ కొత్త బట్టలను బహుకరించారు.
About The Author
30 Apr 2026
